'చిత్రలహరి' ట్రైలర్ విడుదల
- April 07, 2019
'నా పేరు విజయ్.. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలో లేదు. ఆ విజయం నా జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను' అంటున్నారు సాయి ధరమ్ తేజ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'చిత్రలహరి'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కథానాయికలు. ఈ చిత్ర ట్రైలర్ను ఆదివారం విడుదల చేశారు. తన జీవితం ఎంత నరకంగా ఉందో ధరమ్ తేజ్ వివరిస్తున్న సన్నివేశాలతో ట్రైలర్ మొదలైంది. 'ఒకే దిక్కున ఉదయించే సూర్యుడు నాలుగు దిక్కులు ఉదయించినా ఇంత వెలుతురు కూడా రాని జీవితం నాది. ఎందుకంటే చీకటికి చిరునామా నేను..' అని ధరమ్ తేజ్ బాధపడుతూ చెబుతున్న డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఏప్రిల్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







