'చిత్రలహరి' ట్రైలర్ విడుదల
- April 07, 2019
'నా పేరు విజయ్.. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలో లేదు. ఆ విజయం నా జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను' అంటున్నారు సాయి ధరమ్ తేజ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'చిత్రలహరి'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కథానాయికలు. ఈ చిత్ర ట్రైలర్ను ఆదివారం విడుదల చేశారు. తన జీవితం ఎంత నరకంగా ఉందో ధరమ్ తేజ్ వివరిస్తున్న సన్నివేశాలతో ట్రైలర్ మొదలైంది. 'ఒకే దిక్కున ఉదయించే సూర్యుడు నాలుగు దిక్కులు ఉదయించినా ఇంత వెలుతురు కూడా రాని జీవితం నాది. ఎందుకంటే చీకటికి చిరునామా నేను..' అని ధరమ్ తేజ్ బాధపడుతూ చెబుతున్న డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఏప్రిల్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







