రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- April 12, 2019
అజ్మన్:డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సీట్బెల్ట్ లేకపోవడం, అప్రమత్తంగా వుండకపోవడం వెరసి ఓ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అజ్మన్లోని అల్ జోరా ప్రాంతంలోగల అల్ ఇత్తిహాద్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 49 ఏళ్ళ ఈజిప్టియన్ ప్రాణాలు కోల్పోగా, అతని భార్య ఇద్దరు చిన్నారులకు ఈ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. డ్రైవింగ్ సమయంలో సరైన అటెన్షన్ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అజమ్మన్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ అల్ ఫలాసీ చెప్పారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పెట్రోల్స్, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్, సివిల్ డిఫెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. గాయపడ్డవారికి తక్షణ సహాయం అందించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలని అల్ ఫలాసి సూచించారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









