రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- April 12, 2019అజ్మన్:డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సీట్బెల్ట్ లేకపోవడం, అప్రమత్తంగా వుండకపోవడం వెరసి ఓ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అజ్మన్లోని అల్ జోరా ప్రాంతంలోగల అల్ ఇత్తిహాద్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 49 ఏళ్ళ ఈజిప్టియన్ ప్రాణాలు కోల్పోగా, అతని భార్య ఇద్దరు చిన్నారులకు ఈ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. డ్రైవింగ్ సమయంలో సరైన అటెన్షన్ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అజమ్మన్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ అల్ ఫలాసీ చెప్పారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పెట్రోల్స్, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్, సివిల్ డిఫెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. గాయపడ్డవారికి తక్షణ సహాయం అందించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలని అల్ ఫలాసి సూచించారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?