రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- April 12, 2019
అజ్మన్:డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సీట్బెల్ట్ లేకపోవడం, అప్రమత్తంగా వుండకపోవడం వెరసి ఓ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అజ్మన్లోని అల్ జోరా ప్రాంతంలోగల అల్ ఇత్తిహాద్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 49 ఏళ్ళ ఈజిప్టియన్ ప్రాణాలు కోల్పోగా, అతని భార్య ఇద్దరు చిన్నారులకు ఈ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. డ్రైవింగ్ సమయంలో సరైన అటెన్షన్ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అజమ్మన్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ అల్ ఫలాసీ చెప్పారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పెట్రోల్స్, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్, సివిల్ డిఫెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. గాయపడ్డవారికి తక్షణ సహాయం అందించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలని అల్ ఫలాసి సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







