బంఫర్ ఆఫర్..ఎసీలపై భారీ డిస్కౌంట్
- April 12, 2019
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తాజాగా సూపర్ కూలింగ్ డేస్ పేరుతో మెగా సమ్మర్ సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా వివిధ ఉత్పత్తులపై 65 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఏప్రిల్ 10 నుంచి మొదలైన ఈసేల్ 14 వరకు అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లయితే 10 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేకమైన ధర తగ్గింపు ప్రయోజనాలు ఉంటాయని ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఇకపోతే ఏసీలను తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. ఫ్రిజ్లను రూ.6,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ సంస్థ ఎంపిక చేసిన ఉత్పత్తులపై డెబిట్ కార్డు, ఈఎంఐ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఏసీకి నెలవారీ ఈఎంఐరూ.1,210 నుంచి ప్రారంభమైతే. ఫ్రిజ్ రూ.459 నుంచి ప్రారంభమవుతోంది. పానాసోనిక్ ఏసీలైతే ఇన్స్టాలేషన్ పూర్తి ఉచితంగా చేస్తారట. ఇతర కంపెనీలవైతే రూ.499 చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఏసీలు ఎక్సేంజ్ ఏమైనా చేసుకోదలిస్తే రూ.6,000 వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. ఫోన్పే యూజర్లకు రూ.250 తక్షణ తగ్గింపు సౌలభ్యం ఉంది. అలాగే 2 నెలల ఎలక్ట్రిసిటీ బిల్లుపై రూ.1,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







