చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా గోల్డ్ స్వాధీనం
- April 12, 2019
చెన్నై:చెన్నైలో 3.50 కిలోల బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో 13 మందిని పట్టుకుని వీరి వద్దనుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు వేర్వేరు ఘటనల్లో బంగారం పట్టుబడింది. దీని విలువ కోటి 15 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముగ్గురు యువకులు ఏప్రిల్ 12వ తేదీ గురువారం రాత్రి దుబాయ్ నుండి చెన్నైకి వచ్చారు. వీరిని ఎయిర్ పోర్టు అధికారులు తనిఖీలు చేయగా అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. 900 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కొలంబో నుండి చెన్నైకి వచ్చిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా 1.26 కిలోల బంగారం బయటపడింది. నైరోబీ నుండి వచ్చిన ఇద్దరు యువకులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా లో దుస్తుల్లో బంగారం ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 3.50 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ
- 2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’
- తెలుగు సినిమా పాటకు సిరివెన్నెల గౌరవాన్ని తీసుకొచ్చారు: ఉపరాష్ట్రపతి