చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా గోల్డ్ స్వాధీనం
- April 12, 2019చెన్నై:చెన్నైలో 3.50 కిలోల బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో 13 మందిని పట్టుకుని వీరి వద్దనుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు వేర్వేరు ఘటనల్లో బంగారం పట్టుబడింది. దీని విలువ కోటి 15 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముగ్గురు యువకులు ఏప్రిల్ 12వ తేదీ గురువారం రాత్రి దుబాయ్ నుండి చెన్నైకి వచ్చారు. వీరిని ఎయిర్ పోర్టు అధికారులు తనిఖీలు చేయగా అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. 900 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కొలంబో నుండి చెన్నైకి వచ్చిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా 1.26 కిలోల బంగారం బయటపడింది. నైరోబీ నుండి వచ్చిన ఇద్దరు యువకులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా లో దుస్తుల్లో బంగారం ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 3.50 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు