దుబాయ్ ఎయిర్ పోర్ట్ రన్ వే మూసివేత: నమోదు కాని 'ఆలస్యం'
- April 17, 2019
దుబాయ్:డిలేస్, డిస్రప్షన్స్ లేకుండా ఎమిరేట్స్ విమానాల్ని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి)కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సదరన్ రన్ వే అభివృద్ధి పనుల్లో భాగంగా 45 రోజులపాటు మూసివేస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తొలి రోజు పెద్దగా అవాంతరాలు ఏమీ కనిపించలేదు. మే 30 వరకు ఈ రన్వేని మూసివేస్తారు. ఈ కాలంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్ళాల్సిన కొన్ని విమానాల్ని డిబ్ల్యుసి లేదా షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి నిర్వహిస్తారు. ముందస్తు ప్లానింగ్తో 'ఆలస్యాల్ని' నివారించగలిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణీకుల్ని ముందస్తుగానే అప్రమత్తం చేయడంతో వారి సహకారం కారణంగా పని మరింత సులవవుతోందని వారు చెబుతున్నారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డబ్ల్యుసి 65 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఉచిత సర్వీస్ షటిల్స్ని ప్రతి 30 నిమిషాలకు ఏర్పాటు చేస్తున్నారు. డెడికేటెడ్ ఫ్లీట్ ఆఫ్ ట్యాక్సీలు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







