స్థలం మీది.. ప్లాన్ మాది: మే 1 నుంచి GHMC..
- April 19, 2019
హైదరాబాద్:గ్రేటర్ హైదరబాద్లోని 500 చ.గ విస్తీర్ణంలోపు స్థలాలకు ఇంటి ప్లాన్ ఉచితంగా అందిస్తామంటోంది జీహెచ్ఎంసీ. ఇందుకు సంబంధించిన 2 వేల ఇంటి నమూనాలను సిద్ధం చేసినట్లు కమిషనర్ ఎం. దానకిశోర్ తెలిపారు. మే1 నుంచి ఈ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలోనే దరఖాస్తు దారులు తమకు నచ్చిన నమూనాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిపిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని వివరించారు. ఇంటి అనుమతుల ప్రక్రియ అవినీతికి ఆస్కారం లేకుండా జరపాలన్నారు. నగరంలో ఏటా 17 వేల ఇంటి నిర్మాణాలు మంజూరవుతున్నాయని అందులో 80 శాతం 500 గజాల్లోపు విస్తీర్ణం కలిగినవే వుంటున్నాయన్నారు. 48 గంటల్లోపు ఆయా దరఖాస్తులను పరిశీలించి వెంటనే అనుమతులు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









