స్థలం మీది.. ప్లాన్ మాది: మే 1 నుంచి GHMC..
- April 19, 2019
హైదరాబాద్:గ్రేటర్ హైదరబాద్లోని 500 చ.గ విస్తీర్ణంలోపు స్థలాలకు ఇంటి ప్లాన్ ఉచితంగా అందిస్తామంటోంది జీహెచ్ఎంసీ. ఇందుకు సంబంధించిన 2 వేల ఇంటి నమూనాలను సిద్ధం చేసినట్లు కమిషనర్ ఎం. దానకిశోర్ తెలిపారు. మే1 నుంచి ఈ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలోనే దరఖాస్తు దారులు తమకు నచ్చిన నమూనాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిపిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని వివరించారు. ఇంటి అనుమతుల ప్రక్రియ అవినీతికి ఆస్కారం లేకుండా జరపాలన్నారు. నగరంలో ఏటా 17 వేల ఇంటి నిర్మాణాలు మంజూరవుతున్నాయని అందులో 80 శాతం 500 గజాల్లోపు విస్తీర్ణం కలిగినవే వుంటున్నాయన్నారు. 48 గంటల్లోపు ఆయా దరఖాస్తులను పరిశీలించి వెంటనే అనుమతులు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







