స్థలం మీది.. ప్లాన్ మాది: మే 1 నుంచి GHMC..
- April 19, 2019హైదరాబాద్:గ్రేటర్ హైదరబాద్లోని 500 చ.గ విస్తీర్ణంలోపు స్థలాలకు ఇంటి ప్లాన్ ఉచితంగా అందిస్తామంటోంది జీహెచ్ఎంసీ. ఇందుకు సంబంధించిన 2 వేల ఇంటి నమూనాలను సిద్ధం చేసినట్లు కమిషనర్ ఎం. దానకిశోర్ తెలిపారు. మే1 నుంచి ఈ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలోనే దరఖాస్తు దారులు తమకు నచ్చిన నమూనాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిపిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని వివరించారు. ఇంటి అనుమతుల ప్రక్రియ అవినీతికి ఆస్కారం లేకుండా జరపాలన్నారు. నగరంలో ఏటా 17 వేల ఇంటి నిర్మాణాలు మంజూరవుతున్నాయని అందులో 80 శాతం 500 గజాల్లోపు విస్తీర్ణం కలిగినవే వుంటున్నాయన్నారు. 48 గంటల్లోపు ఆయా దరఖాస్తులను పరిశీలించి వెంటనే అనుమతులు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు