స్థలం మీది.. ప్లాన్ మాది: మే 1 నుంచి GHMC..
- April 19, 2019హైదరాబాద్:గ్రేటర్ హైదరబాద్లోని 500 చ.గ విస్తీర్ణంలోపు స్థలాలకు ఇంటి ప్లాన్ ఉచితంగా అందిస్తామంటోంది జీహెచ్ఎంసీ. ఇందుకు సంబంధించిన 2 వేల ఇంటి నమూనాలను సిద్ధం చేసినట్లు కమిషనర్ ఎం. దానకిశోర్ తెలిపారు. మే1 నుంచి ఈ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలోనే దరఖాస్తు దారులు తమకు నచ్చిన నమూనాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిపిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని వివరించారు. ఇంటి అనుమతుల ప్రక్రియ అవినీతికి ఆస్కారం లేకుండా జరపాలన్నారు. నగరంలో ఏటా 17 వేల ఇంటి నిర్మాణాలు మంజూరవుతున్నాయని అందులో 80 శాతం 500 గజాల్లోపు విస్తీర్ణం కలిగినవే వుంటున్నాయన్నారు. 48 గంటల్లోపు ఆయా దరఖాస్తులను పరిశీలించి వెంటనే అనుమతులు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ