బంగాళాఖాతంలోవాయుగుండం..

- April 26, 2019 , by Maagulf
బంగాళాఖాతంలోవాయుగుండం..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం…. తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్‌కు ఫణి అని నామకరణం చేశారు వాతావరణ అధికారులు. దీని ప్రభావంతో.. రేపట్నుంచి తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. వేటకు వెళ్లిన మత్య్సకారులు.. ఈ నెల 28నాటికి వెనక్కి తిరిగా రావాలని హెచ్చరించారు.

ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకున్న ఉన్న హిందూమహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం వాయువ్యంగా పయనించి తుపాన్‌గా బలపడుతుందంటున్నారు వాతావరణ అధికారులు. ఇది దక్షిణ తమిళనాడు తీరం దిశగా కదులుతుందని.. . దీని ప్రభావంతో… ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఈ తుఫాన్‌కు ఫణి అని పేరు పెట్టారు. దీని ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 27 నుంచే తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశలోని దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 45 – 55 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అక్కడక్కడా పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 28 నాటికి వేటకెళ్లిన మత్య్సకారులు వెనక్కి తిరిగి రావాలన్నారు.

ఈ నెల 30న కన్యాకుమారి ప్రాంతంలో తుఫాన్‌ తీరం దాటే అవకాశముందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో.. కన్యాకుమారి తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com