మోదీపై పోటీకి సిద్దమవుతున్న రైతులు.. అడ్డుకుంటున్న పోలీసులు
- April 28, 2019
వారణాసిలో ప్రధాని మోదీపై పోటీకి సై అన్న నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు వారణాసి చేరుకున్నాయి. అయితే నామినేషన్లు వేసేందుకు వెళ్లిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెదిరింపులు, వేధింపులతో భయాందోళనకు గురి చేస్తున్నారు అక్కడి పోలీసులు. నామినేషన్లు వేయకుండా అడుగడుగునా రైతులను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.
పసుపుకు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసేందుకు నిజామాబాద్ నుంచి వారణాసికి వెళ్లిన 50 మంది రైతులు..నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే యూపీ ఇంటలిజెన్స్ వర్గాలు నామినేషన్ ప్రక్రియకు ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల నామినేషన్కు మద్దతుగా సంతకం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. లోకల్ షూరిటీ ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇంతకుముందు కొందరు ముందుకొచ్చినా స్థానిక బీజేపీ నేతల ఒత్తిడి వెల్ల వారు వెనక్కు తగ్గుతున్నారు. దీంతో ప్రపోజల్స్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
మరోవైపు తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ చెందిన రైతులు నామినేషన్ వేసేందుకు వారణాసి బయలుదేరి వస్తున్నారని తెలుసుకున్న స్థానిక పోలీసులు.. కొన్ని కారణాలను సాకుగా చూపుతూ వారిని అరెస్టు చేశారు. బెయిల్పై బయటకు వచ్చిన రైతులు…వెనక్కి తగ్గకుండా నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు.
అంతే కాదు అటు బీజేపీ కార్యకర్తలు నేతలు కూడా రైతులను నామినేషన్లు వేయకుండా బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిన్న నామినేషన్లు వేయకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నట్లు రైతులు చెబుతున్నారు. పసుపు బోర్డు, పసుపునకు మద్దతు ధర కోసం నామినేషన్ వేసేందుకు వచ్చిన తమను.. అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని… ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము నామినేషన్లు వేసి తీరుతామని అంటున్నారు.
వారణాసి బయలుదేరినప్పుటి నుంచి వారికి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. వారణాసి వెళ్లేందుకు మొదట రైతులు రైలు బోగీ బుక్ చేసుకున్నా… చివరి నిమిషంలో అధికారులు రద్దు చేశారు. దీంతో బస్సు ఏర్పాటు చేసుకొని వెళ్లారు. వారికి అక్కడకు వెళ్లాక నామినేషన్ కు మద్దతుగా సంతకం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కావాలనే తమ నామినేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నిజామాబాద్ రైతులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







