అనుమానాలు నిజమయ్యాయి.. ఫలితాల్లో తప్పుల వెనుక అసలు కథ
- April 28, 2019
అనుమానాలు నిజమయ్యాయి.. ఆరోపణలు వాస్తవమని తేటతెల్లమైంది. ఇంటర్ ఫలితాల్లో తప్పులు జరిగాయని త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి. గతేడాది 80 శాతానికి పైగా మార్కులు సంపాదించి ఈ సారి ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు.. గ్లోబరీనా సంస్థలు ఆటలాడుకున్నాయనే కారణంతో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ధార్నాలు హోరెత్తుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు నిజమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇటీవల వెల్లడించిన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లాయని త్రిసభ్య కమిటీ తేల్చినట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి ప్రకటించారు. 531 మంది జాగ్రఫీ విద్యార్థులకు ప్రాక్టికల్ మార్కులు పడలేదని కమిటీ గుర్తించినట్లు తెలిపారు. 496 మంది విద్యార్థుల విషయంలో పరీక్షా కేంద్రం కేటాయింపులో పొరపాట్లు జరిగాయని అందువల్లే ఆబ్సెంట్-పాస్ అనే గందరగోళం ఏర్పడిందని వివరించారు. ఒక ఓఎంఆర్ పత్రంలో మాత్రం సరిగ్గా బబుల్ చేయకపోవడంతో 99 మార్కులకు బదులు సున్నా మార్కులు వచ్చాయని అన్నారు. దీనికి సంబంధించిన అధికారిపై తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గతేడాది 80 శాతానికి పైగా మార్కులు సంపాదించి ఈసారి ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. హాల్టికెట్ల జారీ దగ్గర నుంచి ఫలితాల వెల్లడి వరకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ఇచ్చి ఉంటే బాగుండేదని కమిటీ చెప్పిందన్నారు జనార్థన్ రెడ్డి. గతంతో పోలిస్తే పబ్లిష్ చేసినప్పుడు కొన్ని తప్పులు దొర్లిన విషయాన్ని కమిటీ గుర్తించిందన్నారు. సాంకేతిక సమస్యలతోనే 99 మార్కులకు గాను.. 0 మార్కులు పడ్డాయని, జంబ్లింగ్ విధానంలోనూ కొన్ని సమస్యలు వచ్చాయని అభిప్రాయపడ్డారు.ఇటు త్రిసభ్య కమిటీ రిపోర్ట్ వచ్చినా.. అటు విద్యాశాఖ కార్యదర్శి గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా.. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు తగ్గడం లేదు. ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







