మస్కట్ లో 'తెలుగు కళా సమితి' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు
- May 09, 2019
ఒమన్:ఒమన్ దేశం లోని మస్కట్ నగరంలో (*భారతీయ సామాజిక సంఘం (Indian Social Club) కు అనుబంధమైన తెలుగు విభాగానికి (Telugu Wing) సంబంధించిన*) తెలుగు కళా సమితి, మే నెల 3వ తేదీన "శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు" ను కడు రమ్యంగా నిర్వహించింది.
మస్కట్ లో నివసిస్తున్న (*తెలుగు కుటుంబాలే కాకుండా పరిసర పట్టణమైన సోహర్ నుంచి కూడా* )అనేక తెలుగు కుటుంబాలు సుమారు 600 వరకు ఈ ఉగాది వేడుకలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ ఉగాది వేడుకలు లో ముఖ్యంగా ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కవితా పఠనం, అష్టావధానం వంటి సాంప్రదాయ కార్యక్రమాలు మాత్రమే కాకుండా, శాస్త్రీయ/సాంప్రదాయ నృత్యాలు, బృంద గీతాలు, నాటికలు వంటి అంశాల్లో అనేకమంది చిన్నారులు, పెద్దలు అత్యంత సంబరంతో పాల్గొని ఆహుతులను రంజింప చేశారు.
ముఖ్యంగా ఈ ఉగాది వేడుకల్లో ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, నటుడు, దర్శకులు అయిన యండమూరి వీరేంద్రనాథ్ ముఖ్య అతిధి గా పాల్గొని నిండైన శోభ తెచ్చారు. ఈ వేడుకల్లో పూర్వ కార్యవర్గ సభ్యులను, ఇతర ప్రతిభావంతులైన వారిని గుర్తించి, ముఖ్య అతిథి యండమూరి వీరేంద్రనాథ్ చే సత్కరించటం జరిగింది.
వేడుకల అనంతరం, తెలుగు వారికి ఇష్టమైన వంటకాలతో నోరూరించే ఉగాది విందు ఏర్పాటు చేయడం జరిగింది.
_1557412321.jpg)
_1557412151.jpg)
_1557412125.jpg)
_1557412137.jpg)
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







