హైదరాబాద్ నుంచి సింగపూర్‌-మలేసియా ప్రయాణికులకు ప్రత్యేక ప్యాకేజీ

- May 11, 2019 , by Maagulf
హైదరాబాద్ నుంచి సింగపూర్‌-మలేసియా ప్రయాణికులకు ప్రత్యేక ప్యాకేజీ

విశాఖపట్నం:హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌-మలేసియా ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. జూన్‌-24న అర్ధరాత్రి 12-15 (తెల్లారితే 25) గంటలకు హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణం ప్రారంభం కానుంది. 5 రాత్రుళ్లు, 6 పగళ్ల ప్యాకేజీలో ఒకరికి అయితే రూ.89,440. ఇద్దరు, ముగ్గురు బృందమైతే.. ఒక్కొక్కరికీ రూ.76 వేలు, పిల్లలకు (2-11 ఏళ్ల మధ్య) బెడ్‌తో అయితే రూ.66,840, బెడ్‌ లేకుండా రూ.57,510గా నిర్ణయించారు. ఇతర వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌ఫాం నంబరు-1పై ఉన్న ఐఆర్‌సీటీసీ కౌంటర్‌లో గానీ, 9078089263, 9701360695 ఫోన్‌ నంబర్లకుగానీ సంప్రదించవచ్చని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com