మద్యం మత్తులో సోదరిపై కాల్పులు జరిపిన కువైటీ
- May 11, 2019కువైట్: కువైటీ వ్యక్తి ఒకరు మద్యం మత్తులో తన సోదరిపైనే కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన ఆపరేషన్ రూమ్కి ఈ సమాచారం అందింది. సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి పారామెడిక్స్, సెక్యూరిటీ సిబ్బంది చేరుకున్నారు. ఆ సమయంలో సంఘటనా స్థలంలో కలష్నికోవ్ గన్తో నిందితుడు కన్పించాడు. తన సోదరితో జరిగిన గొడవ కారణంగా తాను ఆమెపై దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోంది. ఆ పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు వెల్లడించారు. నిందితుడి సోదరుల్ని ఈ కేసులో సాక్షులుగా పరిగణిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు