మద్యం మత్తులో సోదరిపై కాల్పులు జరిపిన కువైటీ
- May 11, 2019
కువైట్: కువైటీ వ్యక్తి ఒకరు మద్యం మత్తులో తన సోదరిపైనే కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన ఆపరేషన్ రూమ్కి ఈ సమాచారం అందింది. సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి పారామెడిక్స్, సెక్యూరిటీ సిబ్బంది చేరుకున్నారు. ఆ సమయంలో సంఘటనా స్థలంలో కలష్నికోవ్ గన్తో నిందితుడు కన్పించాడు. తన సోదరితో జరిగిన గొడవ కారణంగా తాను ఆమెపై దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోంది. ఆ పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు వెల్లడించారు. నిందితుడి సోదరుల్ని ఈ కేసులో సాక్షులుగా పరిగణిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







