365 కిలోల డ్రగ్స్ స్వాధీనం
- May 13, 2019
దుబాయ్ పోలీసులు 365 కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 278 మిలియన్ దిర్హామ్లుగా అంచనా వేస్తున్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ పట్టివేత ఘటనగా భావిస్తున్నారు పోలీసులు. మొత్తం 16 మంది ఆసియాకి చెందిన వ్యక్తుల్ని ఈ ఘటనలో అనుమానితులుగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో ముగ్గురు వాహనం స్పేర్ పార్ట్స్లో డ్రగ్స్ని అమర్చి స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 268 కిలోల హెరాయిన్, 9.6 కిలోల క్రిస్టల్ మెత్, 1 కిలో హాషిష్ని పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మాట్లాడుతూ, నిందితులు విదేశాలకు చెందినవారిగా గుర్తించినట్లు చెప్పారు. మిగతా నిందితుల్ని అరెస్టు చేసే క్రమంలో వివిధ దేశాల సహాయ సహకారాల్ని తీసుకుంటామనీ వివరించారాయన.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







