365 కిలోల డ్రగ్స్ స్వాధీనం
- May 13, 2019
దుబాయ్ పోలీసులు 365 కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 278 మిలియన్ దిర్హామ్లుగా అంచనా వేస్తున్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ పట్టివేత ఘటనగా భావిస్తున్నారు పోలీసులు. మొత్తం 16 మంది ఆసియాకి చెందిన వ్యక్తుల్ని ఈ ఘటనలో అనుమానితులుగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో ముగ్గురు వాహనం స్పేర్ పార్ట్స్లో డ్రగ్స్ని అమర్చి స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 268 కిలోల హెరాయిన్, 9.6 కిలోల క్రిస్టల్ మెత్, 1 కిలో హాషిష్ని పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మాట్లాడుతూ, నిందితులు విదేశాలకు చెందినవారిగా గుర్తించినట్లు చెప్పారు. మిగతా నిందితుల్ని అరెస్టు చేసే క్రమంలో వివిధ దేశాల సహాయ సహకారాల్ని తీసుకుంటామనీ వివరించారాయన.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







