ఎక్స్‌లెంట్‌ దుబాయ్‌ క్యాబ్‌ డ్రైవర్లకు ఉచిత ఉమ్రా యాత్ర

- May 18, 2019 , by Maagulf
ఎక్స్‌లెంట్‌ దుబాయ్‌ క్యాబ్‌ డ్రైవర్లకు ఉచిత ఉమ్రా యాత్ర

దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన్‌ (డిటిసి), ఉమ్రా ట్రిప్స్‌ని 25 మంది ట్యాక్సీ డ్రైవర్లకు ఈ రమదాన్‌ సీజన్‌లో ప్రకటించింది. ఇయర్‌ ఆఫ్‌ టోలరెన్స్‌ కూడా ఈ గొప్ప కార్యక్రమానికి కలిసి రావడం గమనార్హం. 2010 సంవత్సరం నుంచి దుబాయ్‌ ట్యాక్సీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మొత్తం 1200 మందికి ఇప్పటిదాకా ఈ అవకాశాన్ని కల్పించారు. సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ఇనీషియేటివ్‌ని దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన్‌ ప్రారంభించింది. ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డిటిసి డైరెక్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అదెల్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. ఎక్స్‌లెంట్‌ పెర్ఫామింగ్‌ డైరెక్టర్స్‌కి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com