కేసీఆర్ సంతకం ఫోర్జరీ చేసిన ముగ్గురు అరెస్ట్

- May 18, 2019 , by Maagulf
కేసీఆర్ సంతకం ఫోర్జరీ చేసిన ముగ్గురు అరెస్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకంను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్డీవో ఫిర్యాదుతో నిందితులను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో రెండు ఎకరాల భూమి రెగ్యులరైజేషన్ కోసం సీఎం లెటర్ ప్యాడ్ తో ఉన్న కాపీని నిందితులు రెవెన్యూ శాఖకు పంపారు. లెటర్ ప్యాడ్ ను యాకత్ పురాకు చెందిన టీఆర్ఎస్ నేత నుంచి రూ.45వేలకు మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి కొనుగోలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com