ఈనెల 30న ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం
- May 23, 2019
ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయం దిశగా దూసుకెళుతుండడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఎల్లుండి వైసీపీ శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో జగన్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు గెలిచిన ఎమ్మెల్యేలు. అలాగే ఈనెల 30న జగన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ స్పష్టమైన మెజారిటీ దిశగా వెళుతున్నట్టు కనిపించడంతో తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద కార్యకర్తల కోలాహలం నెలకొంది. ఫలితాలు చూస్తున్న జగన్.. ఎంపీ విజయసాయిరెడ్డిని ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో వైసీపీ అధినేత జగన్ విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఫోన్ చేశారు. దీంతో స్వామిజి జగన్ ను అభినందనించారు. ఫలితాలపై ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు జగన్.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!