ఈనెల 30న ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం
- May 23, 2019ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయం దిశగా దూసుకెళుతుండడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఎల్లుండి వైసీపీ శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో జగన్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు గెలిచిన ఎమ్మెల్యేలు. అలాగే ఈనెల 30న జగన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ స్పష్టమైన మెజారిటీ దిశగా వెళుతున్నట్టు కనిపించడంతో తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద కార్యకర్తల కోలాహలం నెలకొంది. ఫలితాలు చూస్తున్న జగన్.. ఎంపీ విజయసాయిరెడ్డిని ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో వైసీపీ అధినేత జగన్ విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఫోన్ చేశారు. దీంతో స్వామిజి జగన్ ను అభినందనించారు. ఫలితాలపై ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు జగన్.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..