5జి నెట్వర్క్: ఎటిసలాట్ తొలి మెనా నెట్వర్క్
- May 30, 2019యూ.ఏ.ఈ:ఎట్టకేలకు యూఏఈలో 5జి సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. టెలికామ్ ఆపరేటర్ ఎటిసలాట్, ఇకపై యూఏఈలో వినియోగదారులు 5జి నెట్వర్క్ని పొందవచ్చునని ప్రకటించింది. ఎలాంటి అదనపు ఛార్జీలూ లేకుండా 5జి రెడీ జెడ్టిఇ యాక్సన్ 10 ప్రో ద్వారా ఈ కొత్త అనుభూతిని పొందడానికి వీలుంది. 4జితో పోల్చితే 20 రెట్లు వేగంతో 5జి సేవలు వినియోగదారులకు గొప్ప అనుభూతినివ్వనున్నాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అత్యంత వేగంతో కూడిన నెట్వర్క్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎటిసలాట్ పేర్కొంది. యాక్సాన్ 10 ప్రో కొనుగోలు కోసం మూడు ఆప్షన్స్ని ఎటిసలాట్ వినియోగదారుల ముందుంచింది. వీటిల్లో స్ట్రెయిట్ పేమెంట్ కింద 5,555 దిర్హామ్లు చెల్లించవచ్చు. అలాగే, 12, 18, 24 నెలల ఇన్స్టాల్మెంట్స్ ప్రాతిపదికన 473, 318, 241 దిర్హామ్లు చెల్లించడానికీ అవకాశం కల్పిస్తున్నారు. పోస్ట్పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం