గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంచలన నిర్ణయం
- May 31, 2019
ఎంత పనిచేసినా జీతం ఎక్కువ ఇవ్వట్లేదని బాధపడే వాళ్లను చూస్తాం. వేతన సవరణ కోసం ఉద్యమాలు, ఆందోళనలు సర్వసాధారణం. కంపెనీ ఏదైనా ఉద్యోగుల్లో నిరంతరం అసంతృప్తి కలిగించేది ఏదైనా ఉందంటే జీతమే. ఏటేటా ఇంక్రిమెంట్ ఉన్నా.. ఏదో వెలితి ఉంటుంది. కానీ తాను చేస్తున్న పనికి ఇప్పటికే ఎక్కువ జీతం వస్తోంది అదనంగా ఇంక అవసరం లేదు అనే వాళ్లను చూశారా? గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అదే పని చేశారు.
ఐటీ దిగ్గజ కంపెనీ గూగుల్ కు మన భారతీయుడు సుందర్ పిచాయ్ సీఈవోగా ఉన్నారు. ఆయన ప్రతిభను మెచ్చి గూగుల్ కంపెనీ రూ.405 కోట్లను ఆయనకు ఇన్సెంటీవ్ గా ఇచ్చింది. అయితే ఆయన సున్నితంగా తోసిపుచ్చారు. తనకు ఇప్పటికే వేతనం రూపంలో కంపెనీ ఎక్కువగా ఇస్తోందని, అదనపు డబ్బు అవసరం లేదన్నారట. ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న కార్పొరేట్ సీఈవోల్లో సుందర్ పిచాయ్ ఒకరు. ఆయనకు ఏడాదికి దాదాపు రూ.13వందల కోట్లు జీతం వస్తోంది. ఆయన జీతాన్ని గూగుల్ కంపెనీ ఈ ఏడాది మళ్లీ సవరించనుంది. దీంతో పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







