కాబూల్ లో కారు బాంబు పేలుడు..
- May 31, 2019
కాబూల్:కారు బాంబు పేలుడు ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాబూల్ జిల్లాలోని పుల్-ఎ-చఖ్రీ రోడ్డుపై ఈ పేలుడు సంభవించింది. భద్రతాదళాల కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని జరిపిన పేలుడులో నలుగురు చనిపోగా..యూఎస్ సర్వీస్ మెన్ తోపాటు మరికొంతమంది గాయపడ్డారని అప్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నశ్రత్ రహిమి తెలిపారు. ఉదయం 8:30 గంటలకు ఖాలా-ఇ-వజీర్ ప్రాంతంలో కారు బాంబు పేలుడు జరిగిందన్నారు. అయితే ఈ దాడులు ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే పశ్చిమ కాబూల్ లోని మిలటరీ అకాడమీకి సమీపంలో జరిగిన పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







