కాబూల్ లో కారు బాంబు పేలుడు..

- May 31, 2019 , by Maagulf
కాబూల్ లో కారు బాంబు పేలుడు..

కాబూల్:కారు బాంబు పేలుడు ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాబూల్ జిల్లాలోని పుల్-ఎ-చఖ్రీ రోడ్డుపై ఈ పేలుడు సంభవించింది. భద్రతాదళాల కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని జరిపిన పేలుడులో నలుగురు చనిపోగా..యూఎస్ సర్వీస్ మెన్ తోపాటు మరికొంతమంది గాయపడ్డారని అప్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నశ్రత్ రహిమి తెలిపారు. ఉదయం 8:30 గంటలకు ఖాలా-ఇ-వజీర్ ప్రాంతంలో కారు బాంబు పేలుడు జరిగిందన్నారు. అయితే ఈ దాడులు ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే పశ్చిమ కాబూల్ లోని మిలటరీ అకాడమీకి సమీపంలో జరిగిన పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com