సమ్మిట్ లో మాట్లాడుకోని మోడీ, ఇమ్రాన్ ఖాన్
- June 14, 2019



కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. జూన్ 13 నుంచి 14 వరకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా మోడీ ఇదే వేదికగా పావులు కదపనున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొలిరోజు సమావేశంలో ఆయా దేశాల నేతలు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. చైనా,రష్యా,సహా పలుదేశాల అధినేతలతో మోడీ మాటలు కలిపారు గానీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో మాత్రం మాట్లాడలేదు.
గురువారం(జూన్-13,2019)బిష్కెక్ లో సమ్మిట్ కు హాజరైన నాయకులందరికీ కిర్గిస్థాన్ అధ్యక్షుడు సూరన్ బే జీన్ బెకోవ్ విందు ఏర్పాటు చేశారు. ఇక్కడ మోడీ, ఇమ్రాన్ ఖాన్ కలిసి కూర్చోలేదని సమాచారం. అంతేకాదు విందు సమయంలోనూ ఇద్దరు ప్రధానులు కుశల ప్రశ్నలు వేసుకోలేదని సమాచారం. దీంతో వీరిద్దరి గురించి అక్కడి నేతల మధ్య చర్చ కూడా వచ్చింది. ఎస్సీవో వేదికగా మోడీ అన్ని దేశాల నేతలతో సమావేశమవనున్నారు. కానీ ఇమ్రాన్ ఖాన్తో మాత్రం భేటీ లేనట్లేనని తెలుస్తోంది. ఎస్సీవో సదస్సు ప్రారంభానికి ముందు కలిసి చర్చించుకుందామని పాక్ ప్రధాని ఇమ్రాన్, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ఇద్దరూ భారత్కు విడివిడిగా లేఖలు రాసిన విషయం తెలిసిందే.
దేశ ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేసిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ పట్ల భారత్ కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది.పాక్ తో ఇక మాటల్లేవ్ అని ప్రధాని మోడీ గతంలో పలుసార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
మరోసారి పాకిస్థాన్కు మోదీ వార్నింగ్ ఇచ్చారు. పొరుగు దేశం ఉగ్రవాదాన్ని అదుపు చేయాలన్నారు. కిర్గిస్తాన్లో జరుగుతున్న షాంఘై సహకార సమ్మిట్లో శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే మోదీ తన హెచ్చరికలు కొనసాగించారు. అయితే మోదీ ఎక్కడా తన ప్రసంగంలో పాకిస్థాన్ పేరును ప్రస్తావించలేదు. భారత్ను నిర్వీర్యం చేసేందుకు ఓ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఇలా గత కొన్నేళ్లుగా జరుగుతోందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి దేశం ఐక్యంగా ముందుకు రావాలన్నారు. ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న, మద్దతు ఇస్తున్న దేశాలనే బాధ్యుల్ని చేయాలని మోదీ అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









