రాష్ట్రీయ ఇసాయి మంచ్‌

- January 04, 2016 , by Maagulf
రాష్ట్రీయ ఇసాయి మంచ్‌

క్రైస్తవులకు చేరువ కావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ఒక సంస్థను ప్రారంభించనున్నది. రాష్ట్రీయ ఇసాయి మంచ్‌ పేరిట ప్రారంభం కానున్న ఈ సంస్థ ద్వారా క్రైస్తవులకు చేరువ కావాలని ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తోంది. ఆరెస్సెస్‌ ముస్లింలను మచ్చిక చేసుకోవడానికి ఇప్పటికే ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ను ప్రారంభించింది. అవే మార్గదర్శకాలతో క్రైస్తవ రాష్ట్రీయ మంచ్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. ముస్లిం రాష్ట్రీయ మంచ్‌కు రూపకల్పన చేసిన ఆరెస్సెస్‌ సీనియర్‌ ప్రచారక్‌ ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. నలుగురైదుగురు ఆర్చ్‌బిషప్‌లు, సుమారు 40 నుంచి 50 మంది రివరెండ్‌ బిషప్‌లతో సమావేశాలు నిర్వహించామని, తద్వారా సంస్థ ఏర్పాటుకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించామని ఆరెస్సెస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్‌ కుమార్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com