రాష్ట్రీయ ఇసాయి మంచ్
- January 04, 2016
క్రైస్తవులకు చేరువ కావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఒక సంస్థను ప్రారంభించనున్నది. రాష్ట్రీయ ఇసాయి మంచ్ పేరిట ప్రారంభం కానున్న ఈ సంస్థ ద్వారా క్రైస్తవులకు చేరువ కావాలని ఆరెస్సెస్ ప్రయత్నిస్తోంది. ఆరెస్సెస్ ముస్లింలను మచ్చిక చేసుకోవడానికి ఇప్పటికే ముస్లిం రాష్ట్రీయ మంచ్ను ప్రారంభించింది. అవే మార్గదర్శకాలతో క్రైస్తవ రాష్ట్రీయ మంచ్ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. ముస్లిం రాష్ట్రీయ మంచ్కు రూపకల్పన చేసిన ఆరెస్సెస్ సీనియర్ ప్రచారక్ ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. నలుగురైదుగురు ఆర్చ్బిషప్లు, సుమారు 40 నుంచి 50 మంది రివరెండ్ బిషప్లతో సమావేశాలు నిర్వహించామని, తద్వారా సంస్థ ఏర్పాటుకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించామని ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ చెప్పారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







