వాహనదారులకు అత్యవసర సందేశాలను ప్రసారం చేయనున్న షార్జా పోలీసులు
- June 24, 2019
వాహనదారులకు అత్యవసర సందేశాలను ప్రసారం చేయడానికి షార్జా పోలీసులు ఆదివారం కొత్త రేడియో ఆధారిత సేవను ప్రారంభించారు. ఈ సేవ అన్ని పోలీసు పెట్రోలింగ్లలో జూలై 1 నుండి లభ్యమవుతుంది.
సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ డాక్టర్ అహ్మద్ సయీద్ అల్ నౌర్ మాట్లాడుతూ, ఈ పరికరం రేడియో తరంగాల ద్వారా పరిసర వాహనాలకు వివిధ భాషలలో సందేశాలను పంపుతుంది. పెట్రోలింగ్కు/పెట్రోలింగ్ వాహనం వస్తున్నట్లు వాహనదారులకు తెలియజేస్తూ వారికి దారి ఇవ్వవలసిందిగా సూచిస్తుంది. దీనిద్వారా అతి తక్కువ సమయంలో ఎమెర్జెనీ ప్రదేశానికి పోలీసులు చేరుకోవచ్చని తెలిపారు.
ఈ పరికరంలో రికార్డ్ చేయబడిన మూడు ఆడియో క్లిప్లు కలిగి ఉంటాయి. వాటిని ఇలా వివరించారు డాక్టర్ అహ్మద్ సయీద్ అల్ నౌర్:
- మొదటి సందేశం వాహనదారులను సమీపించే పోలీసు లేదా అత్యవసర వాహనం ఉనికిని హెచ్చరిస్తుంది.
- రెండవది అత్యవసర లేదా పోలీసు వాహనం ముందు నిలిపి ఉంచినట్లు వారిని హెచ్చరిస్తుంది.
- మూడవది పోలీసు వాహనం జంక్షన్ కు చేరుకున్నప్పుడు వాహనదారులను ఆపమని అభ్యర్థిస్తుంది.
ఈ సందేశాలను పాటించి ప్రతి వాహనదారుడు పోలీసు, అత్యవసర మరియు అధికారిక కాన్వాయ్ వాహనాలకు దారి వదిలి, అధికారులకు మెరుగైన సేవ అందించేందుకు సహకరించవలసినదిగా కోరారు.
ఈ సందేశాలను ఖాతరు చేయక/అడ్డుకునే వాహదారులకు 3 వేల డాలర్ల జరిమానా విధించబడతారని, వారి వాహనాలను ఆరు ట్రాఫిక్ పాయింట్లతో పాటు 30 రోజుల పాటు నిర్బంధించనున్నట్లు బ్రిగ్ అల్ నౌర్ తెలిపారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







