యూఏఈలో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరే అవకాశం
- June 29, 2019
అబుదాబీలోని లివాలో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరనున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. దుబాయ్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను అందుకోనున్నాయి. అబుదాబీలో 47 డిగ్రీల వరకూ వుండొచ్చు. షార్జాలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. వాతావరణంలో పెద్దగా మార్పులు వుండకపోవచ్చనీ, వేడి ఎక్కువగా వుంటుందనీ, అక్కడక్కడా పాక్షికంగా ఆకాశం మేఘావృతమై వుంటుందని ఎన్సిఎం వెల్లడించింది. అత్యధికంగా హ్యుమిడిటీ కోస్టల్ ఏరియాస్లో 65 నుంచి 85 శాతానికి చేరుకుంటుంది. ఇంటీరియర్ రీజియన్స్లో 60 నుంచి 80 శాతం వరకు, మౌంటెయిన్స్లో 50 నుంచి 70 శాతం వరకు హ్యుమిడిటీ వుండొచ్చు. గాలుల వేగం గంటకు 40 కిలోమీటర్లుగా వుంటుంది. సముద్రం సాధారణ స్థాయిలోనే వుంటుంది. శనివారం, ఆదివారం అలాగే సోమవారం కూడా వాతావరణ పరిస్థితులు దాదాపుగా ఇలాగే వుంటాయని ఎన్సిఎం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







