యూఏఈలో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరే అవకాశం
- June 29, 2019
అబుదాబీలోని లివాలో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరనున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. దుబాయ్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను అందుకోనున్నాయి. అబుదాబీలో 47 డిగ్రీల వరకూ వుండొచ్చు. షార్జాలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. వాతావరణంలో పెద్దగా మార్పులు వుండకపోవచ్చనీ, వేడి ఎక్కువగా వుంటుందనీ, అక్కడక్కడా పాక్షికంగా ఆకాశం మేఘావృతమై వుంటుందని ఎన్సిఎం వెల్లడించింది. అత్యధికంగా హ్యుమిడిటీ కోస్టల్ ఏరియాస్లో 65 నుంచి 85 శాతానికి చేరుకుంటుంది. ఇంటీరియర్ రీజియన్స్లో 60 నుంచి 80 శాతం వరకు, మౌంటెయిన్స్లో 50 నుంచి 70 శాతం వరకు హ్యుమిడిటీ వుండొచ్చు. గాలుల వేగం గంటకు 40 కిలోమీటర్లుగా వుంటుంది. సముద్రం సాధారణ స్థాయిలోనే వుంటుంది. శనివారం, ఆదివారం అలాగే సోమవారం కూడా వాతావరణ పరిస్థితులు దాదాపుగా ఇలాగే వుంటాయని ఎన్సిఎం వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









