ఈ ఉల్లంఘనకు పాల్పడితే, ఇకపై మూడింతల జరీమానా!
- July 02, 2019
యూఏఈ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వాహనదారులను ఉద్దేవించి ఓ హెచ్చరికను జారీ చేసింది పోలీస్ కార్లు, అఫీషియల్ పెరేడ్ వెహికిల్స్, అంబులెన్సెస్ వంటి ఎమర్జన్సీ వెహికిల్స్కి దారి ఇవ్వనిపక్షంలో 3,000 దిర్హామ్ల జరీమానా విధిస్తారన్నది ఆ హెచ్చరిక సారాంశం. ఉల్లంఘనకు పాల్పడితే వాహనాల్ని 30 రోజుల పాటు సీజ్ చేస్తారు. వాహనాన్ని నడిపే వ్యక్తికి ఆరు ట్రాఫిక్ పాయింట్లు కూడా విధించడం జరుగుతుంది. జులై 1 నుంచి ఈ కొత్త జరీమానా అమల్లోకి వచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో మరిన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు అమల్లోకి వస్తాయనీ, వాహనదారుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘనల్ని ఉపేక్షించేది లేదని అధికార యంత్రాంగం చెబుతోంది. ఎమర్జన్సీ సైరన్ని రోడ్ యూజర్స్ గమనించాలని, ఎమర్జన్సీ వెహికిల్సకి దారి ఇవ్వాలనీ, అది పౌరులు, నివాసితుల బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







