దుబాయ్‌, మస్కట్‌ మధ్య ఎ380 సర్వీసుల్ని ప్రారంభించిన ఎమిరేట్స్‌

- July 04, 2019 , by Maagulf
దుబాయ్‌, మస్కట్‌ మధ్య ఎ380 సర్వీసుల్ని ప్రారంభించిన ఎమిరేట్స్‌

ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ ఎ380 విమాన సర్వీసుల్ని దుబాయ్‌ - మస్కట్‌ మధ్య ప్రారంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద పౌర విమాన సర్వీసుగా ఎ380ని అభివర్ణిస్తారు. అంత పెద్ద విమానం, కేవలం 340 కిలోమీటర్ల దూరంలో వున్న రెండు డెస్టినేషన్స్‌ మధ్య ప్రయాణిస్తుండడం విశేషమే. 42 మంది సిబ్బంది ఎ380 విమానాన్ని క్లీన్‌ చేయడానికి సుమారు 35 నిమిషాలు పడుతుంది. కానీ, కేవలం 40 నిమిషాల్లోనే ఈ విమానం దుబాయ్‌ నుంచి మస్కట్‌కి చేరుకుంటుంది. మస్కట్‌ - దుబాయ్‌ మధ్య సంబంధాలు మరింత బలపడేలా, ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేలా ఈ ఎ380 విమానాన్ని నడుపుతున్నట్లు ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. ప్రతిరోజూ రెండు విమాన సర్వీసులు మస్కట్‌ - దుబాయ్‌ మధ్య నడుస్తాయి. జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com