బహ్రెయిన్‌లో వలసదారులకు డబుల్‌ షాక్‌

- January 05, 2016 , by Maagulf
బహ్రెయిన్‌లో వలసదారులకు డబుల్‌ షాక్‌

నీరు, విద్యుత్‌ బిల్లులు బహ్రెయిన్‌లో వలసదారులకు షాక్‌ ఇవ్వనున్నాయి. రెండు రెట్లు టారిఫ్‌ని పెంచుతూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు ఎనర్జీ మినిస్టర్‌ డాక్టర్‌ అబ్దుల్‌హసన్‌ మీర్జా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. క్యాబినెట్‌ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫైనాన్షియల్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఎక్స్‌పెండిచర్స్‌ రేషనలైజింగ్‌ మినిస్ట్రీరియల్‌ కమిటీ సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ మరియు వాటర్‌ అథారిటీతో సింగిల్‌ అకౌంట్‌ గల బహ్రెయినీ పౌరులకు ఈ పెంపు వర్తించదు. అయితే మల్టిపుల్‌ అకౌంట్స్‌ ఉన్నవారికీ, అలాగే నాన్‌ డొమెస్టిక్‌ వినియోగదారులు (ఇండస్ట్రియల్‌ మరియు కమర్షియల్‌) మాత్రం పెరిగిన ఛార్జీలకు అనుగుణంగా బిల్లులు చెల్లించకతప్పదు. 2019 నాటికి పూర్తిగా వీటిపై సబ్సిడీ ఎత్తివేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com