బహ్రెయిన్లో వలసదారులకు డబుల్ షాక్
- January 05, 2016
నీరు, విద్యుత్ బిల్లులు బహ్రెయిన్లో వలసదారులకు షాక్ ఇవ్వనున్నాయి. రెండు రెట్లు టారిఫ్ని పెంచుతూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు ఎనర్జీ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్హసన్ మీర్జా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. క్యాబినెట్ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫైనాన్షియల్ ఎఫైర్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ రేషనలైజింగ్ మినిస్ట్రీరియల్ కమిటీ సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీతో సింగిల్ అకౌంట్ గల బహ్రెయినీ పౌరులకు ఈ పెంపు వర్తించదు. అయితే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నవారికీ, అలాగే నాన్ డొమెస్టిక్ వినియోగదారులు (ఇండస్ట్రియల్ మరియు కమర్షియల్) మాత్రం పెరిగిన ఛార్జీలకు అనుగుణంగా బిల్లులు చెల్లించకతప్పదు. 2019 నాటికి పూర్తిగా వీటిపై సబ్సిడీ ఎత్తివేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







