"డియర్ కామ్రేడ్ " ట్రైలర్
- July 11, 2019
టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా ఇలా వరుస విజయాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా వచ్చిన గీత గోవిందం సినిమా ఎంత మంచి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. మరోసారి ఈ జంట తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ,రష్మిక జంటగా 'డీయర్ కామ్రెడ్'రూపొందుతుంది.
ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ నిర్మిస్తోంది. ఈ సినిమా క్రీడా నేపథ్యం ఉన్న సినిమాగా తెలుస్తోంది. క్రికెట్ మ్యాచ్ కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. గతంలో కూడా ఇదే కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన లిరికల్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. 'నీ నీలి కన్నుల్లోని ఆకాశమే.. తెల్లారి అల్లేసింది నన్నే..' అంటూ సాగుతున్న ఈ లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది.
విజయ్ దేవరకొండ ఇటీవల తన ట్విటర్లో.. ఈ పాటను ఇప్పటివరకు వందసార్లకు పైగా విన్నానని, ఇంకా వినాలపిస్తోందని అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మొత్తానికి ఈ మూవీ క్రికెట్ నేపథ్యంతో పాటు మంచి ప్రేమ కథా లా కనిపిస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్పై నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే నెల 31న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానున్నది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..