ఒమన్ నుంచి వలస కుటుంబాల నిష్క్రమణ
- January 05, 2016
ఒమన్లో పెరిగిపోతున్న 'కాస్ట్ ఆఫ్ లివింగ్' అక్కడి వలస కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులను తీసుకొస్తోంది. సబ్సిడీలు ఎత్తివేయడం, అధిక పన్నులు విధిస్తుండడంతో తమ జీవనం కష్టమవుతోందని వలస కుటుంబాలు అంటున్నాయి. తన కుటుంబాన్ని భారతదేశానికి పంపించేస్తున్నానని కేరళ నుంచి వచ్చి ఒమన్లో స్థిరపడ్డ అస్రాఫ్ అహ్మద్ అనే వ్యక్తి చెప్పాడు. తన జీతం 620 ఒమన్ రియాల్స్ మాత్రమేననీ, జీవనం భారమైపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని అతను అన్నాడు. చంద్ర అనే ఇంకో వ్యక్తి, ఇప్పటికే తన కుటుంబాన్ని ఇండియాకి పంపించేసినట్లు చెప్పాడు. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పతనంతో ఒమన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఒమన్ వాసులపై పన్నుల వడ్డనకు దిగింది ఒమన్ ప్రభుత్వం. ప్రధానంగా వలసదారులపై ఒమన్ పన్నుల మోత మోగిస్తుండడంతో, అక్కడి కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. తక్కువ అద్దె ఉన్న ఇళ్ళ కోసం ఎక్కువమంది చూస్తున్నారు. దాంతో ఎక్కువ అద్దె ఉన్న ఇళ్ళకు గిరాకీ తగ్గింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







