ఒమన్ నుంచి వలస కుటుంబాల నిష్క్రమణ
- January 05, 2016
ఒమన్లో పెరిగిపోతున్న 'కాస్ట్ ఆఫ్ లివింగ్' అక్కడి వలస కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులను తీసుకొస్తోంది. సబ్సిడీలు ఎత్తివేయడం, అధిక పన్నులు విధిస్తుండడంతో తమ జీవనం కష్టమవుతోందని వలస కుటుంబాలు అంటున్నాయి. తన కుటుంబాన్ని భారతదేశానికి పంపించేస్తున్నానని కేరళ నుంచి వచ్చి ఒమన్లో స్థిరపడ్డ అస్రాఫ్ అహ్మద్ అనే వ్యక్తి చెప్పాడు. తన జీతం 620 ఒమన్ రియాల్స్ మాత్రమేననీ, జీవనం భారమైపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని అతను అన్నాడు. చంద్ర అనే ఇంకో వ్యక్తి, ఇప్పటికే తన కుటుంబాన్ని ఇండియాకి పంపించేసినట్లు చెప్పాడు. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పతనంతో ఒమన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఒమన్ వాసులపై పన్నుల వడ్డనకు దిగింది ఒమన్ ప్రభుత్వం. ప్రధానంగా వలసదారులపై ఒమన్ పన్నుల మోత మోగిస్తుండడంతో, అక్కడి కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. తక్కువ అద్దె ఉన్న ఇళ్ళ కోసం ఎక్కువమంది చూస్తున్నారు. దాంతో ఎక్కువ అద్దె ఉన్న ఇళ్ళకు గిరాకీ తగ్గింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









