కులభూషణ్ పై ఐసిజె తీర్పును స్వాగతిస్తున్నా - పాక్ ప్రధాని
- July 19, 2019
ఇస్లామాబాద్ : కుల్భూషణ్ జాదవ్ కేసులో బుధవారం అంతర్జాతీయ న్యాయస్థానం ( ఐసిజెే) ఇచ్చిన తీర్పు పట్ల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఐసిజె తీర్పును స్వాగతిస్తున్నానని ట్వీట్ చేశారు. జాదవ్ను నిర్దోషిగా తేల్చినందుకు, రిలీజ్ చేయమని ఆదేశించనందుకు హర్షిస్తున్నట్టు ఇమ్రాన్ తెలిపారు. పాకిస్థాన్ ప్రజలకు వ్యతిరేకంగా జాదవ్ నేరాలకు పాల్పడ్డారని, ఆ కేసుల్లో అతను దోషిగా ఉన్నాడని ఇమ్రాన్ ఆరోపించారు. చట్టం ప్రకారమే పాక్ ఈ కేసులో ముందుకు వెళ్తుందని ఇమ్రాన్ ఖాన్ తన ట్వీట్ లో తెలిపాడు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన భారత నౌకాదళ విశ్రాంత అధికారి జాదవ్ను పాక్ మిలిటరీ కోర్టు దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భారత్కు అనుకూలంగా బుధవారం అంతర్జాతీయ కోర్టు రూలింగ్ ఇచ్చింది. జాదవ్కి పాకిస్థాన్ మిలటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ కోర్టు నిలిపివేసింది. జాదవ్ ఉరిశిక్షపై మరోసారి పరిశీలించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ కోర్టు ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు జాదవ్కు అవకాశం ఇవ్వాలని చెప్పింది. ఈ కేసులో 16 మంది న్యాయమూర్తుల్లో 15మంది భారత్ వాదనకు మద్దతు పలికారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







