డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ధర జీహెచ్‌ఎంసీ పరిధిలో పెంపు

- January 06, 2016 , by Maagulf
డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ధర జీహెచ్‌ఎంసీ పరిధిలో పెంపు

 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల యూనిట్ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిట్ ధర రూ.5.30 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. పెరిగిన యూనిట్ ధరతో జీహెచ్‌ఎంసీపై రూ.145.52 కోట్ల అదనపు భారం పడనుంది. నగరంలోని మల్లేపల్లి ఫిరోజ్‌గాంధీ నగర్‌లో స్థలంను క్రమబద్ధీకరించింది. ఆక్రమణకు గురైన 18వేల చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. గజం ధర రూ.1250 చొప్పున ఫీజు చెల్లించాలని నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com