భారతీయ వస్త్ర కౌగిలిలో బ్రిటీష్ ప్రిన్స్
- August 01, 2019
రాజకుమారుడిని భారతీయ వస్త్రం తన కౌగిలిలో దాచుకుంది. బ్రిటీష్ రాచరిక కుటుంబానికి చెందిన మేఘన్ మెర్కెల్ లతన చిన్నారి ఆర్చీకి భారతీయ టవల్ కప్పింది. దీంతో భారత్పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకుంది. రాజస్థాన్లోని జైపూర్ పరిసర ప్రాంతాలలో తయారయ్యే వస్త్రాలను హాంకాంగ్కి చెందిన మలబార్ బేబీ బ్రాండ్ సంస్థ కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. దాదాపు యూరోపియన్ దేశాలన్నింటికి ఈ వస్త్రాలను ఎగుమతి చేస్తోంది ఆ సంస్థ. అయితే కొద్ది నెలల క్రితం విదేశీ జర్నలిస్టు ప్రతినిధుల బృందం జైపూర్ సమీపంలోని గ్రామంలో గల నయికా ‘ ఫ్యాక్టరీని సందర్శించింది.
ఆ బృందం అక్కడ తయారు చేసే శాలువాలు, టవల్స్ తదితర వస్త్రాలను పరిశీలించారు. అనంతరం వాటిని తయారుచేసే కార్మికుల కష్టాలు తెలుసుకున్నారు. నెలకు కేవలం 6 వేల జీతంపై తాము పనిచేస్తామని, కానీ తమ కష్టానికి ఇది ఏ మాత్రం చాలడంలేదు అంటూ అరుణ రెగర్ అనే కార్మికురాలు తమ బాధలను వారితో చెప్పుకున్నారు. విదేశాలలో ఆ వస్త్రాల డిమాండ్ను పాత్రికేయ బృందం ఆమెకు వివరించారు. అక్కడ వీటికి పలికే ధర తెలిసి ఆమె షాక్కి గురయింది. తాము కష్టపడి వీటిని తయారు చేస్తే వీటికి ఈ దేశంలో విలువ తక్కువని, కానీ బ్రిటన్ వంటి దేశాల్లో వీటి ధరలు ఇంతగా ఉంటాయని తాము భావించలేదని తెలిపింది. యూరప్లో వీటికి ఉన్న డిమాండ్ కారణంగా నయికా ఫ్యాక్టరీకి ఆర్డర్ల సంఖ్య పెరిగింది. దీంతో పరిశ్రమ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. మేఘన్ మెర్కెల్ తన కుమారుడి పైకప్పిన ఆ టవల్ పరిశ్రమలో పనిచేసే కార్మికుల వ్యధాభరిత జీవితాలను వెలుగులోకి తీసుకువచ్చేలా చేసింది. గంటకు వారి వేతనం 36 పైసలు మాత్రమే అని తెలిపే దీనమైన బతుకు చిత్రం విదేశీ మీడియాను సైతం ఆకర్షించింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







