ఇండిగో నుంచి కొత్తగా మరో 24 విమానాలు
- January 06, 2016
సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉన్న దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నుంచి కొత్తగా మరో 24 విమానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. వీటిలో దిల్లీ తిరువనంతపురం మధ్య ప్రతిరోజు తిరిగే తొలి నాన్స్టాప్ సర్వీసు ఉంది. కొత్తగా వచ్చిన 24 విమానాలతో దేశంలో 39 నగరాల మధ్య ఇండిగో విమాన సర్వీసుల సంఖ్య మరింత పెరగనుంది. బెంగళూరు నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్, అహ్మదాబాద్.. భువనేశ్వర్ నుంచి కోల్కతా, చెన్నై నుంచి తిరువనంతపురం మధ్య నాన్స్టాప్ సర్వీసులు తిరగనున్నాయి. దిల్లీతిరువనంతపురం మధ్య నాన్స్టాప్ సేవలు రేపటి నుంచే అందుబాటులోకి రానున్నాయి. విమాన ప్రయాణ ధరలు అందుబాటులో ఉండటంతో కేరళ వాసులకు దిల్లీ తిరువనంతపురం నాన్స్టాప్ సర్వీసుతో ఎక్కువ మేలు చేకూరనుందని ఇండిగో సంస్థ అధ్యక్షుడు ఆదిత్యఘోష్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







