కోటి విలువ బంగారం స్మగ్లింగ్ ఆరోపణలపై ఆరుగురు భారతీయుల అరెస్టు
- August 05, 2019కొలంబో:రూ.1.7 కోట్ల విలువచేసే బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలతో ఆరుగురు భారతీయులను శ్రీలంకలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్కడి అధికారులు అరెస్టు చేశారు. కటునాయకేలో ఉన్న ఈ విమానాశ్రయంలోని శ్రీలంక సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విమానాశ్రయంలోని 'డిపార్చ్ టెర్మినల్' వద్ద నలుగురు భారతీయుల వద్ద నుండి 1.06 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, ప్రత్యేక దర్యాప్తులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుండి 1.370 కిలోల బంగారాన్ని స్వాధీన పరుచుకున్నామని పోలీసులు వెల్లడించారు. మొత్తంగా రూ.1.7 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పర్యాటక వీసాపై శ్రీలంక వెళ్లిన భారతీయులు తిరిగి స్వస్థలానికి చేరుకుంటున్న సమయంలో విమానాశ్రయంలో ఈ సోదాలు నిర్వహించారు. నిందితులను శ్రీలంక కస్టమ్స్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు