ఇజ్రాయిల్ను ఎవరు సమర్థించినా వ్యతిరేకిస్తాం
- August 05, 2019
అంకారా: ఈ ఏడాది ఆరంభంలో ఏడేళ్ల పాలస్తీనా చిన్నారులను హత్య చేసిన వారిని సమర్ధిస్తున్న ఇజ్రాయిల్, అమెరికాలపై టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ను ఎవరు సమర్ధించినా వారిని తాము వ్యతిరేకిస్తామని ఆయన ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ 'యూదు రాజ్య' చట్టాన్ని అమలులోకి తేవటంపై ఆయన స్పందిస్తూ ఈ చర్యతో కొంతమంది ఇజ్రాయిలీ నేతలలో హిట్లర్ స్ఫూర్తి మళ్లీ తలెత్తుతోందనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. టర్కీ రష్యా నుండి ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయటంతో ఆ దేశానికి ఎఫ్35 యుద్ధ విమానాల విక్రయాలను అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎర్డొగాన్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







