యూఏఈ రాఫెల్ లో 15 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇద్దరు తెలంగాణా వాసులు
- August 05, 2019
యూఏఈ:మాజీ దుబాయ్ రెసిడెంట్ అలాగే, అబుదాబీకి చెందిన అతని స్నేహితుడు 15 మిలియన్ దిర్హామ్లను బిగ్ టికెట్ అబుదాబీ రాఫెల్ లో గెలుచుకున్నారు. విలాస్ రిక్కాల, రవి మాసిపెద్ది.. ఇద్దరూ ఇండియాలోని తెలంగాణకు చెందిన నిజామాబాద్ జిల్లా వాసులు. కొంతకాలంగా ఈ ఇద్దరూ టిక్కెట్లు కొనుగోలు చేస్తూ వస్తున్నారు. అయితే, జులై 29న కొనుగోలు చేసిన టాక్కెట్కి అదృష్టం వరించింది. ఇండియాకి వెళ్ళిపోయిన విలాస్ రిక్కాల, తనకు వచ్చిన బహుమతి పట్ల అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దుబాయ్లో 4 నుంచి 5 ఏళ్ళు పనిచేశానని ఆయన చెప్పారు. మరోపక్క రవి మాసిపెద్ది మాట్లాడుతూ, చాలా ఏళ్ళుగా తామిద్దరం టిక్కెట్లు కొంటున్నామనీ, ఎట్టకేలకు తమకు బహుమతి లభించిందని అన్నారు. చెరో సగం బహుమతిని తాము పంచుకుంటామని చెప్పారు. కాగా, టాప్ 10 విన్నర్స్లో ఇండియన్స్ ఎక్కువగా వున్నారు. మొత్తం ఐదుగురు బిగ్ టికెట్ అబుదాబీ రాఫెల్ లో విజేతలుగా నిలిచారు. ఫిలిప్పీన్స్ నుంచి ఇద్దరు, ఈజిప్ట్ మరియు సోమాలియా నుంచి చెరొకరు విజేతలున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







