పాకిస్తాన్ మరో సంచలన నిర్ణయం

- August 08, 2019 , by Maagulf
పాకిస్తాన్ మరో సంచలన నిర్ణయం

కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను భారత ప్రభుత్వం రద్దు చేయడంపై పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇప్పటికే భారత్ తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన పాక్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్, పాక్ ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును వాగా బార్డర్ వద్దే నిలిపేసింది. కాగా సంఝౌతా ఎక్స్ ప్రెస్ 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. వీక్లీ ఢిల్లీ నుంచి లాహోర్ కి, లాహోర్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుంది. ఇరుదేశాల ప్రయాణికులు ఇందులో ప్రయాణం సాగిస్తున్నారు. అయితే పాక్ తాజా నిర్ణయంతో భారత్ కు పెద్దగా ఒరిగేది లేదని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com