విశాఖ హార్బర్లో అగ్నిప్రమాదం
- August 12, 2019విశాఖ:విశాఖ ఔటర్ హార్బర్లోని టగ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 70శాతం వరకు ఆ టగ్ తగలబడింది. నౌకలో సివిల్ పనుల కోసం సిబ్బందిని తరలిస్తుండగా టగ్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురై సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. వారి ఆర్తనాదాలు గమనించిన కోస్ట్గార్డు సిబ్బంది అప్రమత్తమై వారిని ఓడ్డుకు చేర్చారు. ప్రమాదం సమయంలో టగ్లో 29 మంది సిబ్బంది ఉండగా.. 28 మందిని రక్షించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన టగ్ను జాగ్వార్గా గుర్తించారు. చమురు నౌకల్ని బెర్త్ వద్దకు తీసుకురావడం, నౌకలో సిబ్బంది సేవల కోసం ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పీసీఎల్ ఈ టగ్ను అద్దెకు తీసుకున్నట్టు సమాచారం.
ఏడుగురి పరిస్థితి విషమం...
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఏసీపీ కులశేఖర్ వెల్లడించారు. మిగతా ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. హెచ్పీసీఎల్కు చమురు పైపు అనుసంధానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు ఏసీపీ తెలిపారు. సహాయక చర్యల్లో రాణి రోష్మణి, చార్లి సీ432 నౌకలు పాల్గొన్నాయని కోస్టు గార్డు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం