ఆమె కోసం 65 రోజులుగా ఎదురుచూపులు
- August 13, 2019
యూ.ఏ.ఈ:మానసిక స్థితి సరిగ్గా లేని ఓ మహిళ ఆచూకీ కోసం 65 రోజులుగా కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. శ్రీలంకకు చెందిన మహిళ రోహిని పెరీరా 65 రోజులుగా కన్పించడంలేదని ఆమె భర్త మధుసూధనన్ చెప్పారు. ఎక్కడో ఓ చోట ఆమె జీవించే వుంటుందని నమ్ముతున్నామని ఆయన చెప్పారు. మధుసూధనన్ కేరళకు చెందిన వ్యక్తి. జూన్ 9 నుంచి తన భార్య అదృశ్యమయ్యిందని ఆయన వివరించారు. మధుసూధనన్, రోహిణిలకు ఐదుగురు సంతానం. ఈద్ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారికి తన భార్య కనిపించే అవకాశం వుందంటూ తన భార్య ఆచూకీ కోసం అందర్నీ అభ్యర్థిస్తున్నారు మధుసూధన్.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







