గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన సి.యం కేసీఆర్
- August 15, 2019
తెలంగాణ:స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణలో జల దృశ్యం ఆవిష్కృతం అవుతోందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని అన్నారు. దాని ఫలాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. అదే స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు.
బంగారు తెలంగాణ సౌధాన్ని వేగవంతంగా నిర్మిస్తామన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పునాదులు పడ్డాయని.. అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని గోల్కొండ కోట వేదికగా వివరించారు. బూజు పట్టిన చట్టాల స్థానంలో కొత్తవి తెస్తున్నట్టు చెప్పారాయన. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం బిల్లు ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
తెలంగాణలో సామరస్య జీవనం కొనసాగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజల సహకారం అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి.. ఆరోగ్య తెలంగాణ సాధించామన్నారు. హైదరాబాద్ ప్రజల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వివరించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







