ఆరామ్‌కో ప్లాంట్‌పై డ్రోన్‌ దాడి

- August 19, 2019 , by Maagulf
ఆరామ్‌కో ప్లాంట్‌పై డ్రోన్‌ దాడి

సౌదీ ఎనర్జీ మినిస్టర్‌ ఖాలిద్‌ అల్‌ ఫాలిమ్‌ మాట్లాడుతూ, షయాబ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ లిక్విఫాక్షన్‌ ఫెసిలిటీపై డ్రోన్‌ దాడి జరిగిందని చెప్పారు. చిన్నపాటి అగ్ని ప్రమాదం ఈ డ్రోన్‌ దాడి వల్ల చోటు చేసుకుందనీ, అయితే ఎవరికీ ఈ ఘటనలో ఎలాంటి గాయాలూ కాలేదని ఆయన వివరించారు. ఇరాన్‌ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు చెప్పారు మినిస్టర్‌. సౌదీ అరామ్‌కోకి చెందిన రెస్పాన్స్‌ టీమ్‌ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియా - యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ బోర్డర్‌లో ఈ ఫీల్డ్‌ వుంది. కాగా, అరామ్‌కో ప్లాంట్‌పై దాడి తామే చేశామంటూ హౌతీ తీవ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించుకుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com