యాహూలో ఉద్యోగులపై వేటు పడనుంది
- January 08, 2016
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ యాహూలో ఉద్యోగులపై వేటు పడనుంది. సంస్థ నుంచి 10 శాతం కన్నా ఎక్కువ మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. దీంతో వెయ్యిమందికి పైగా సిబ్బంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఇటీవల యాహూ వాటాదారుల నుంచి ఎదురైన ఒత్తిళ్ల వల్లే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంస్థలోని అన్ని విభాగాలపై ఈ ప్రభావం పడనుంది. ముఖ్యంగా మీడియా బిజినెస్, యూరోపియన్ ఆపరేషన్స్ ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నారు. జనవరి చివరి నుంచే తొలగింపుల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం. యాహూ సీఈవో మరిస్సా మేయర్, ఆమె బృందాన్ని కూడా పదవుల నుంచి తప్పించాలని యాహూ వాటాదారైన స్టార్బోర్డ్ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్కు లేఖ రాసింది. అయితే యాహూ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







