డ్రైవింగ్ చేస్తే.. స్మార్ట్ఫోన్పై ఆశ వదులుకోవాల్సి0ది..
- January 08, 2016ఇక మీదట ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే.. స్మార్ట్ఫోన్పై ఆశ వదులుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రాజస్థాన్ ప్రభుత్వం నూతన ఆదేశాలను జారీ చేసింది. ఎవరైనా వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల కంట పడితే .. వారికి జరిమానా విధించడంతోపాటు.. వారి ఫోన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ నియమాన్ని అమలులోకి తెచ్చినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి గులాబ్ చంద్ కటారియా తెలిపారు. అంతేకాకుండా నాసిరకం హెల్మెట్ల అమ్మకాలను నిలిపివేయాలని.. అలా అమ్మేవారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. జనవరి 18 నుంచి 24 వరకు జరిపే రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ కొత్త నియమం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఆ తర్వాత కఠినంగా అమలుచేస్తామని, రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే ఇలాంటి కఠిన నియమాలు తప్పవని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..