డ్రైవింగ్ చేస్తే.. స్మార్ట్ఫోన్పై ఆశ వదులుకోవాల్సి0ది..
- January 08, 2016
ఇక మీదట ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే.. స్మార్ట్ఫోన్పై ఆశ వదులుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రాజస్థాన్ ప్రభుత్వం నూతన ఆదేశాలను జారీ చేసింది. ఎవరైనా వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల కంట పడితే .. వారికి జరిమానా విధించడంతోపాటు.. వారి ఫోన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ నియమాన్ని అమలులోకి తెచ్చినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి గులాబ్ చంద్ కటారియా తెలిపారు. అంతేకాకుండా నాసిరకం హెల్మెట్ల అమ్మకాలను నిలిపివేయాలని.. అలా అమ్మేవారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. జనవరి 18 నుంచి 24 వరకు జరిపే రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ కొత్త నియమం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఆ తర్వాత కఠినంగా అమలుచేస్తామని, రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే ఇలాంటి కఠిన నియమాలు తప్పవని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







