యాహూలో ఉద్యోగులపై వేటు పడనుంది

- January 08, 2016 , by Maagulf
యాహూలో ఉద్యోగులపై వేటు పడనుంది

 ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ యాహూలో ఉద్యోగులపై వేటు పడనుంది. సంస్థ నుంచి 10 శాతం కన్నా ఎక్కువ మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. దీంతో వెయ్యిమందికి పైగా సిబ్బంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఇటీవల యాహూ వాటాదారుల నుంచి ఎదురైన ఒత్తిళ్ల వల్లే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంస్థలోని అన్ని విభాగాలపై ఈ ప్రభావం పడనుంది. ముఖ్యంగా మీడియా బిజినెస్‌, యూరోపియన్‌ ఆపరేషన్స్‌ ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నారు. జనవరి చివరి నుంచే తొలగింపుల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం. యాహూ సీఈవో మరిస్సా మేయర్‌, ఆమె బృందాన్ని కూడా పదవుల నుంచి తప్పించాలని యాహూ వాటాదారైన స్టార్‌బోర్డ్‌ కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌కు లేఖ రాసింది. అయితే యాహూ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com