లయహారి:
- August 23, 2019
"లయహారి" అనేది ఒక పద్యలక్షణం. చూడడానికి తేలిగ్గా పాడుకునేలా కనిపిస్తున్నా ఈ లక్షణంలో వ్రాయడం కొంత కష్టమే. కారణం ఏమిటంటే ప్రతి పాదంలోనూ ఆఖరి రెండు అక్షరాలు తప్ప అన్నీ లఘువులే ఉండాలి. ప్రతిపాదంలోనూ 37 అక్షరాలుండాలి. ప్రతి పాదంలోనూ 1,11,21, 31 అక్షరాలకు యతి గానీ, ప్రాసయతి గాని పడాలి. ప్రతి పాదంలోనూ రెండవ అక్షరం ఒకే అక్షరానికి చెందాల్సిన ప్రాసనియమం సరేసరి. మొత్తానికి ప్రయత్నిస్తే ఇలా తయారయింది.
పద్యం:
అధరములు మెరవగనె వధసలుపనసురులను, కుధరమును కుదుపగనె మధురపులకించెన్
మధురమగు మురళిసడి సుధగమరి కురియగనె బుధజనులు మురియగనె మధురపులకించెన్
వ్యధలణచ మురిపెముగనధనునికి ధనమొసగి మధువులను చిలుకగనె మధురపులకించెన్
దధిచిలికినటులమరి విధివిధము తెలుపగనె గ్రథితమగు కవితలకు మధురపులకించెన్
భావం:
మందహాసంతో పెదవులు మెరిస్తూ ఉండగానే రాక్షసులను చంపగా, గోవర్ధన పర్వతాన్ని కుదిపి ఎత్తగా మధురానగరం పులకించింది. మధురమైన వేణుగానం అమృతంలా కురవగా, సత్పురుషులు ఆనందపడగా మధురానగరం పులకించింది. బాధలను పోగొట్టే విధంగా ప్రేమతో ధనంలేని కుచేలుడికి ధనమొసగగా మధురానగరం పులకించింది. పెరుగు చిలికినంత చక్కగా విధివిధానాలు తెలిపే కవిత్వంతో భగవద్గీతా గ్రంథాన్ని అందించగా మధురానగరం పులకించింది.
-సిరాశ్రీ
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !
- స్విస్ ఓపెన్: శ్రీకాంత్ శుభారంభం..
- ధోఫర్లో మర్డర్..వ్యక్తి మృతికి గొడవే కారణమా?
- దుబాయ్, షార్జా మధ్య ఈజీ ట్రాఫిక్ కోసం కొత్త రూల్స్..!!
- గాజా మారణహోమంపై ప్రపంచదేశాలు స్పందించాలి: సౌదీ అరేబియా
- చట్టాల ఉల్లంఘన.. రియల్ ఎస్టేట్ డెవలపర్ సస్పెండ్..!!
- ఇండియన్ ఎంబసీలో రమదాన్ సెలబ్రేషన్స్..వెల్లివిరిసిన సోదరభావం..!!
- దుబాయ్ సర్జన్ క్రెడిట్ కార్డ్ హ్యాక్..Dh120,000 ఖాళీ..!!