కాలి బూడిదవుతున్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్
- August 23, 2019
అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కాలి బూడిద అవుతోంది. పదిహేను రోజులకు పైగా మంటలు వ్యాపిస్తుండటంతో అడవి దగ్థం అవుతోంది. హెక్టార్ల కొద్దీ చెట్లు కార్చిచ్చు ధాటికి మండిపోతున్నాయి. దక్షిణ అమెరికా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో పొగ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెజాన్, రోండోనియా రాష్ట్రాల్లో పూర్తిగా పొగ అలుముకుందని అధికారులు చెబుతున్నారు.
ఈ సీజన్ లో ఇక్కడి అధిక ఉష్ణోగ్రత, తక్కువ మొత్తంలోని ఆర్థ్రత కారణంగా అడవిలో మంటలు సాధారణమే. అయితే.. అడవి ప్రాంతంలో ఈ మధ్యకాలంలో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సారి రికార్డ్ స్థాయిలో మంటలు చెలరేగాయి. గత కొన్నాళ్లుగా మంటల ధాటికి ఈ అడవిలోని చెట్లన్నీ కాలి బూడిద అవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే అమెజాన్లో దాదాపు 73 వేల అగ్ని ప్రమాదాలు సంభవించాయని బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐఎన్పీఈ వెల్లడించింది. గడచిన ఐదేళ్లలో అగ్నిప్రమాదాల సంఖ్య 83 శాతం పెరిగింది. మానవ తప్పిదాలు కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అడవుల్లో చెట్లను ఇష్టానుసారంగా కొట్టివేయటం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోంది.
రికార్డ్ స్థాయిలో చెలరేగిన కార్చిచ్చు తీవ్రతకు సంబంధించి శాటిలైట్ ఫోటోను ట్వీట్ చేసింది నాసా. భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు ఆధారమైన అమెజాన్ అడవులు ఇప్పుడు పొగతో నిండిపోయాయి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









