కాలి బూడిదవుతున్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్
- August 23, 2019
అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కాలి బూడిద అవుతోంది. పదిహేను రోజులకు పైగా మంటలు వ్యాపిస్తుండటంతో అడవి దగ్థం అవుతోంది. హెక్టార్ల కొద్దీ చెట్లు కార్చిచ్చు ధాటికి మండిపోతున్నాయి. దక్షిణ అమెరికా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో పొగ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెజాన్, రోండోనియా రాష్ట్రాల్లో పూర్తిగా పొగ అలుముకుందని అధికారులు చెబుతున్నారు.
ఈ సీజన్ లో ఇక్కడి అధిక ఉష్ణోగ్రత, తక్కువ మొత్తంలోని ఆర్థ్రత కారణంగా అడవిలో మంటలు సాధారణమే. అయితే.. అడవి ప్రాంతంలో ఈ మధ్యకాలంలో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సారి రికార్డ్ స్థాయిలో మంటలు చెలరేగాయి. గత కొన్నాళ్లుగా మంటల ధాటికి ఈ అడవిలోని చెట్లన్నీ కాలి బూడిద అవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే అమెజాన్లో దాదాపు 73 వేల అగ్ని ప్రమాదాలు సంభవించాయని బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐఎన్పీఈ వెల్లడించింది. గడచిన ఐదేళ్లలో అగ్నిప్రమాదాల సంఖ్య 83 శాతం పెరిగింది. మానవ తప్పిదాలు కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అడవుల్లో చెట్లను ఇష్టానుసారంగా కొట్టివేయటం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోంది.
రికార్డ్ స్థాయిలో చెలరేగిన కార్చిచ్చు తీవ్రతకు సంబంధించి శాటిలైట్ ఫోటోను ట్వీట్ చేసింది నాసా. భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు ఆధారమైన అమెజాన్ అడవులు ఇప్పుడు పొగతో నిండిపోయాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







