తమిళనాడులో జల్లికట్టుకు కేంద్రం అనుమతించింది..
- January 08, 2016
సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో సంప్రదాయబద్దంగా నిర్వహించే జల్లికట్టుకు కేంద్రం అనుమతించింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవిశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే జంతువులపట్ల క్రూరంగా వ్యవహరించవద్దంటూ పేర్కొంది. జిల్లా అధికారుల పర్యవేక్షణలోనే జల్లికట్లు నిర్వహించాలని కేంద్రం షరతు విధించింది. ఎడ్ల పందాలకు కూడా అనుమతి లభించింది. తమిళనాడు ప్రభుత్వం అనుకున్నది సాధించుకుంది. తమిళనాడులోని జయ ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. తమిళనాడు సంప్రదాయంలో జల్లికట్టు అంతర్భాగమని రెండువేల సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతుందని తెలిపింది. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఇటీవలే ప్రధాని మోదీకి జయలలిత లేఖ రాశారు. మరోవైపు కేంద్ర ప్రభత్వం నిర్ణయంపై జంతు ప్రేమికులు మండిపడ్డారు. రాజకీయ ఒత్తిడులకు కేంద్రం లొంగిపోతోందంటూ విమర్శించారు
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







