తమిళనాడులో జల్లికట్టుకు కేంద్రం అనుమతించింది..

- January 08, 2016 , by Maagulf
తమిళనాడులో  జల్లికట్టుకు కేంద్రం అనుమతించింది..

సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో సంప్రదాయబద్దంగా నిర్వహించే జల్లికట్టుకు కేంద్రం అనుమతించింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవిశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే జంతువులపట్ల క్రూరంగా వ్యవహరించవద్దంటూ పేర్కొంది. జిల్లా అధికారుల పర్యవేక్షణలోనే జల్లికట్లు నిర్వహించాలని కేంద్రం షరతు విధించింది. ఎడ్ల పందాలకు కూడా అనుమతి లభించింది. తమిళనాడు ప్రభుత్వం అనుకున్నది సాధించుకుంది. తమిళనాడులోని జయ ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. తమిళనాడు సంప్రదాయంలో జల్లికట్టు అంతర్భాగమని రెండువేల సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతుందని తెలిపింది. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఇటీవలే ప్రధాని మోదీకి జయలలిత లేఖ రాశారు. మరోవైపు కేంద్ర ప్రభత్వం నిర్ణయంపై జంతు ప్రేమికులు మండిపడ్డారు. రాజకీయ ఒత్తిడులకు కేంద్రం లొంగిపోతోందంటూ విమర్శించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com