బిజెపి సీనియర్ నాయకుడు అరుణ్జైట్లీ కన్నుమూత
- August 24, 2019కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స్ తీసుకుంటూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ వర్గాలు ప్రకటించాయి. కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9వ తేదీన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయన్ను ఎయిమ్స్కు తరలించారు.
1952, నవంబర్ 28న ఢిల్లీలో జన్మించారు. ఈయన తండ్రి ప్రముఖ న్యాయవాది. ఢిల్లీ నుంచి డిగ్రీ, న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఢిల్లీ విశ్వ విద్యాలయంలో అభ్యసిస్తున్న సమయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా కొనసాగారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉన్న ఈయన 19 నెలలు జైలుకు వెళ్లి వచ్చారు. 1991 నుంచి బీజేపీ కార్యవర్గంలో పని చేశారు.
వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా మంత్రిగా నియమించారు. మోడీ హాయాంలో ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అనారోగ్యం కారణంగా జైట్లీ ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది మే 14వ తేదీన రెనాల్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. 2018 ఆగస్టు 23వ తేదీన ఆర్థిక శాఖను ఆయన చేపట్టారు. 2019 మే నెల నుంచి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక శాఖను చూస్తున్నారు. మధ్యంతర బడ్జెట్ను పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ